21 నవంబర్ కరెంట్ ఎఫైర్స్

వాతావరణ నిధి కోసం ప్రత్యేక నిధి : కాప్ 27 సదస్సులో ఒప్పందం
- భూమి ఉష్ణోగ్రతలు పెరగడంతో నష్టపోతున్న పేద దేశాలకు పరిహారం ఇచ్చేందుకు ప్రపంచ దేశాలు మొదటిసారిగా ఒప్పుకున్నాయి.
- కాలుష్య ఉద్గారాలతో కలిగిస్తున్న హానికి ఇలాంటి ఒక 'పరిహార నిధి' ఏర్పాటు చేయాలని వివిధ దేశాలు కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.
- ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ లో 2022 నవంబర్ 20 న ముగిసిన కాప్ 27 సదస్సులో దీనిపై ఒప్పందం కుదిరింది.
- కరవు, వరదలు, వడగాల్పులు, తుపాన్లు లాంటి వైపరీత్యాలతో సతమతం అవుతున్న పేద దేశాలకు దానికి తగ్గట్టుగా పరిహారం ఇస్తారు.
- పరిహార నిధి ఏర్పాటుకు ఒప్పందం కుదరడంపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామమని అన్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్.
- భూతాపానికి ప్రధానమైన శిలాజ ఇంధనాల విషయంలో కాప్ సదస్సులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
- ఇతర దేశాలు చేసిన పర్యావరణ హానికి తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని వివిధ దేశాలు వాదిస్తున్నాయి. దాంతో డబ్బు జమ అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- వివిధ సంస్థలు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా డబ్బు సమీకరించి ఈ నిధిలో జమ చేస్తారు..
- దేశాలు వాతావరణ నిధి కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు సమకూరుస్తామన్న వాగ్దానాన్నే అభివృద్ధి చెందిన దేశాలు ఇంకా నెరవేర్చలేదు.
2020లో దేశంలో అత్యధిక మరణాలు: జనగణన శాఖ నివేదిక
- దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే 4.74 లక్షల మరణాలు అధికంగా జరిగినట్టు కేంద్ర జన గణన శాఖ లేటెస్ట్ రిపోర్టులో తెలిపింది.
- కోవిడ్ వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయని అంచనా.
- తెలుగు రాష్ట్రాల్లో 2020లో 45 ఏళ్లు పైబడిన వారు చాలామంది చనిపోయారు.
- ఏపీలోనూ పెరిగిన మరణాలు
- ఏపీలో మొత్తం 4,54,851 మంది మృతుల్లో 70 ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా 38 శాతం ఉన్నారు.
- తరువాత స్థానంలో 55-64 ఏళ్ల వారు 19 శాతం మంది. 45-54 మధ్య వయసు వారు 14 శాతం మంది చనిపోయారు.
- ఏపీలో పట్టణాల్లో 98,315 మంది పురుషులు, 61,080 మ మహిళలు చనిపోయారు.
- గ్రామీణ ప్రాంతాల్లో 1,75,108 పురుషులు, 1,20,167 మంది మహిళలు మృతి చెందినట్టు రిపోర్టుల బట్టి తెలుస్తోంది.
NGRI డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్
- జాతీయ భూ భౌతిక పరిశో ధన సంస్థ (NGRI) డైరెక్టర్ గా డాక్టర్ ప్రకాశ్ కుమార్ నియమితులయ్యారు.
- ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న వి.ఎం. తివారీ పదవీ కాలం ఆరేళ్లతో పాటు 3 నెలల అదనపు గడువు కూడా ముగిసింది.
- చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కుమార్ భూకంపాలపై కీలక పరిశోధనలు చేశారు. ధన్ భాద్ లోని IIT-ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ లో అప్లయిడ్ జియోఫిజిక్స్ చదివారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియో ఫిజిక్స్ లో PHD చేశారు.
- పరిశోధనలకు యువ శాస్త్రవేత్త, జాతీయ జియో సైన్స్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు.
- NGRIలో అతి పెద్ద పరిశోధనా బృందాల్లో ఒకటైన 'భూకంపాలు, గ్యాస్ హైడ్రేట్ డివిజన్ కు బాధ్యత వహించారు.
ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.