కేంద్ర ప్రభుత్వ పథకాలు (1) – QUICK REVISION

1) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)

- ఒక దేశం - ఒక పథకం అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పథకానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అశిష్ కుమార్ భుటానీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మే 2020 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు
- 2016 జనవరి 13 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ స్కీమ్ కింద ప్రకృతి విపత్తులు, చీడ పీడలతో రైతులు పంట నష్టపోయినప్పుడు త్వరగా బీమా సౌకర్యం, ఇతర సాయం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.
- గతంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, పునర్వవస్థీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం పథకాలను తొలగించి... ఒకే పథకంగా PMFBY తెచ్చారు
- ఈ స్కీమ్ కోసం రైతులు ఖరీఫ్ కి అయితే 2శాతం, రబీకి అయితే 1.5శాతం ప్రీమియం చెల్లించాలి. ఉద్యాన, వాణిజ్య పంటలకైతే 5శాతం ప్రీమియం చెల్లించాలి.

2) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన
- 2015 జూన్‌ 25న ప్రధాని ఆవాస్‌ యోజనను ప్రారంభించారు.
- ఈ పథకం కింద పేదలకు రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తారు.
- 2022 సం.లోగా బలహీన వర్గాల వారికి పూర్తిస్థాయిలో ఇళ్ళని నిర్మిస్తారు.

3) స్మార్ట్‌ సిటీ కార్యక్రమం
- దేశవ్యాప్తంగా వంద నగరాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2015 జూన్‌ 25న ఈ పథకం ప్రారంభించారు.
- 98 స్మార్ట్‌ సిటీల జాబితాను 2015 ఆగస్టు 27న అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
- మొదటి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 13 నగరాలు ఎంపికయ్యాయి.
- తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, తిరుపతి, విశాఖపట్టణం స్మార్ట్‌ సిటీలుగా ఎంపికయ్యాయి.
-ఈ పథకం కింద ఎంపిక చేసిన నగరాల్లో ఐదేళ్ళ పాటు ఏటా రూ.200 కోట్లు కేటాయిస్తారు.

4) ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన
- పరిశ్రమల్లో ప్రమాణాలకు అనుగుణంగా 24 లక్షల మందికి శిక్షణ ఇప్పించే ఉద్దేశ్యంతో 2015 మార్చి 20న ఈ పథకాన్ని ప్రారంభించారు.
- యువతలో స్కిల్ డెవలప్ మెంట్ (నైపుణ్యాలు) కల్పించడం ఈ పథక ప్రధాన ఉద్దేశం.
- మొత్తం పథకానికి రూ.1500 కోట్లు కేటాయించగా... ఇందులో ఈశాన్య ప్రాంత యువతకు రూ.150 కోట్లు ఎలాట్ చేశారు.

5) సుకన్య సమృద్ధి యోజన
- 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ఈ పథకం ప్రారంభమైంది.
- ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకంలో పదేళ్ళ లోపు వారి పేరుతో ఖాతా ప్రారంభించారు.
- అకౌంట్ ను పోస్టాఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు.
- మొదట్లో రూ.1000లతో ఖాతా తెరవాలని షరతు విధించగా, ఆ తర్వాత రూ.200 కనీస మొత్తంగా నిర్ణయించారు. నెలకు ఎంత మొత్తం అయినా జమ చేయడానికి అవకాశముంది.
- బాలిక వయస్సు 21యేళ్ళ చేరగానే ఈ పథకం అయిపోతుంది. మొత్తం 14యేళ్ళ వరకూ డబ్బును జమ చేయాలి.
-18యేళ్ళ తరవాత విద్య కోసం సగం అమౌంట్ తీసుకోవచ్చు.
- 2016-17లో ఈ పథకం కింద వడ్డీరేటు 8.6%

6) స్వచ్ఛభారత్‌
- 2014 అక్టోబరు 2న స్వచ్ఛ్ భారత్ ను ఢిల్లీలోని రాజ్‌పథ్‌ రోడ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.
- ‘స్వచ్ఛభారత్‌ దిశగా ముందడుగు’ అనేది ఈ కార్యక్రమం యొక్క నినాదం
- గతంలో ఉన్న ‘నిర్మల్‌ భారత్‌ అభియాన్‌’ ఈ పథకంలో విలీనమైంది.
- 2019 అక్టోబరు 2 నాటికి గాంధీజీ 150వ జయంతి వరకు పరిశుభ్ర భారత్ చేయాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం.
- స్వచ్ఛభారత్‌కు 2016-17 బడ్జెట్‌లో 11,300 కోట్లు కేటాయించారు.
- స్వచ్ఛభారత్‌ లోగో మహాత్మాగాంధీ కళ్లద్దాలు. దీన్ని రూపొందించింది మహారాష్ట్రకు చెందిన అనంత్‌ ఖసెబర్దార్‌.
- స్వచ్ఛభారత్‌ అభియాన్‌ నిధుల కోసం 2015 నవంబరు 15 నుంచి 5శాతం సర్వీస్ ట్యాక్స్ విధించారు.
- స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద ప్రతి లబ్దిదారుడికి మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందిస్తారు.

7) బేటీ బచావో బేటీ పడావో
- 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్టులో ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకం ప్రారంభించారు.
- స్త్రీ, పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో ఈ పథకం అమలుచేస్తారు.
-మహిళా సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి వారి సామర్ధ్యాన్ని పెంచుతారు.

8) దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
- దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకి ఉద్దేశించిన ఈ పథకాన్ని - 2014 నవంబరు 20న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
- ప్రధాని నరేంద్రమోడీ 2015 జూలై 15న పాట్నాలో ప్రారంభించారు.
- గతంలో ఈ పథకానికి ఉన్న పేరు: గ్రామీణ విద్యుదీకరణ
-వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం.

9) మిషన్‌ ఇంద్రధనుష్‌
- ఈ పథకం 2014 డిసెంబరు 25న ప్రారంభమైంది.
- పిల్లలకు ఏడు రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలు వేస్తారు. అవి: 1) డిప్తీరియా 2) కోరింతదగ్గు 3) ధనుర్వాతం 4) పోలియో 5) క్షయ 6) తట్టు 7) హైపటైటిస్‌-బి

10) అమృత్‌
- AMRUT- Atal Mission for Rejuvenation and Urban Transformation
- ప్రధాని నరేంద్రమోదీ 2015 జూన్‌ 25న దీన్ని ప్రారంభించారు.
- దేశంలోని 500 పట్టణాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారు.
-2015-16లో ఈ మిషన్‌ కింద 89 నగరాలు ఎంపికయ్యాయి.